గౌహతి కి చెందిన “అస్సాం టాల్క్స్ న్యూస్ ఛానల్” కు ఢిల్లీ లో పనిచేస్తున్న ఒక మహిళా
జర్నలిస్ట్.. గౌహతికే చెందిన రెండు న్యూస్ ఛానల్స్ కు చెందిన జర్నలిస్ట్ లపై మానభంగం, లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తన ఎడిటర్ ఇన్ చీఫ్ భుయాన్ తనను ఢిల్లీ లోని సామ్రాట్ హోటల్ లో ఒక సీనియర్ అస్సాం మంత్రితో కలసి నిద్రించమని బలవంతం చేశారని 35 ఏళ్ళ మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు. ఈ విషయమై ఆమె ఢిల్లీ రాజోరి గార్డెన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీస్ లు ఒక జర్నలిస్ట్ పై మానభంగం, మరో జర్నలిస్ట్ పై ఆమె గౌరవానికి భంగం కలిగించడం ఆరోపణలపై కేసు నమోదు చేశారు. తనకు ఉద్యోగం కల్పించి, వివాహం చేసుకొంటానని నమ్మించి తనతో ఆ జర్నలిస్ట్ లైంగిక సంబంధం ఏర్పర్చు కున్నారని ఆమె ఆరోపించారు.
గౌహతి లో ఉన్న భుయాన్ను అరెస్ట్ చేయడం కోసం ఢిల్లీ పోలీస్ బృందం గౌహతి కి వెళ్ళింది. ఈ లోగా ఢిల్లీ లోని తిస్ హజారి జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ కోసం అతని న్యాయవాది దరఖాస్తు చేయగా, దర్యాప్తుకు సహకరిస్తారనే హామీపై న్యాయమూర్తి నాలుగు రోజుల మధ్యంతర ఉపశమనం కలిగించారు. మరో జర్నలిస్ట్ అస్సాం కు చెందిన న్యూస్ ఛానల్ కు పనిచేస్తూ ఢిల్లీ లోనే ఉంటున్నాడు. ముందస్తు బెయిల్ కోసం అతను చేసుకున్న దరఖాస్తును ఢిల్లీ కోర్టు కొట్టి వేసింది.
No comments:
Post a Comment