Friday 5 February 2016

రాజ‌మౌళిపై మోడీకి కంప్లైంట్‌

48844510

బాహుబలి సినిమా డైరెక్ట‌ర్ ఎస్ఎస్‌.రాజ‌మౌళిని అరెస్టు చేయాల‌ని జంతు హక్కుల పరిరక్షకుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజ‌మౌళితో పాటు బాహుబ‌లి నిర్మాతలను అరెస్ట్ చేసి
చర్యలు తీసుకోవాలని జంతు హక్కులను పరిరక్షించే యానిమల్ టాస్క్ ఫోర్స్ బృందం
స‌భ్యులు ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకే ఫిర్యాదు చేశారు. బాహుబ‌లి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీకి కొన‌సాగింపుగా తెర‌కెక్కుతున్న బాహుబ‌లి 2 షూటింగ్ ప్ర‌స్తుతం కేర‌ళ‌లో జ‌రుగుతోంది. కేరళలోని త్రిసూరులో ఇటీవలే బాహుబలి సినిమా ఓ షెడ్యూలు పూర్తిచేసుకుంది. భారత వన్యమృగ బోర్డు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఆ సినిమాలో ఏనుగును షూటింగ్ కోసం ఉపయోగించారని ఆరోపించారు. వన్యమృగాల చట్టం-2001లోని నియమాలను ఉల్లంఘించారని వారు ఆరోపిస్తున్నారు.
     సినిమా యూనిట్ మాత్రం కేవలం ఏనుగును గ్రాఫిక్స్ చేసి సినిమాలో చూపించేందుకే వాడినట్లు చెబుతున్నారని.. కానీ, షూటింగ్ జరుగుతున్నంతసేపు యూనిట్‌లో ఉన్న 50కి పైగా మంది అరుపులు, కేకలతో ఏనుగు ఇబ్బంది పడిందని టాస్క్ ఫోర్స్ సెక్రటరీ వీకే వెంకటాచలం చెప్పారు. ఆ లేఖలో బాహుబలి చిత్ర దర్శకుడు రాజ‌మౌళి, నిర్మాత‌ల‌తోపాటు, కెమేరామెన్, ఆ ఏనుగు యజమాని, మావటిపైనా చర్య తీసుకోవాలని స‌ద‌రు సంస్థ డిమాండ్ చేసింది.

No comments:

Post a Comment