Sunday 14 February 2016

ఫేస్‌బుక్‌లో లోకేష్ పంచ్ అదిరింది.

048045021040

తెలంగాణలో టీఆర్ఎస్ దెబ్బ‌కు టీడీపీ ఢీలా ప‌డిపోయింది. ఇప్పుడు పార్టీలో మిగిలిన‌ శ్రేణుల‌కు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత‌ను పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌ తీసుకున్నారు. పార్టీలో ఉత్తేజాన్ని నింపేందుకు శాయ‌శ‌క్తులా కృషిచేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం, అనంతరం ఎమ్మెల్యేలు వరుస బెట్టి గుడ్‌బై చెప్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నిర్వేదం కనిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఫేస్‌బుక్ వేదిక‌గా మ‌రోసారి టీఆర్ఎసస్‌కు పంచ్ ఇచ్చారు.
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా నింపేందుకు ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరైన తర్వాత కూడా ఎమ్మెల్యే నిమిషాల వ్యవధిలో కండువా మార్చడం వారిని మరింత కుంగదీసింది. పులి మీద పుట్రలాగా…మాజీ ఫ్లోర్‌లీడర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు పదిమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్‌ను కోరడం ఇంకా ఇబ్బందిగా మారింది. దీంతో పార్టీ యువనేత, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ రంగంలోకి దిగారు. తన తండ్రి, పార్టీ అధినేత నాయకులతో ప్రత్యక్షంగా భేటీ అవుతున్న నేపథ్యంలో తన సందేశాన్ని, నమ్మకాన్ని మరో రూపంలో వినిపించారు. సోషల్‌ మీడియా వారధి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టి తన భావాలను పంచుకొని శ్రేణుల్లో భరోసా నింపారు.
ఇంతకీ లోకేష్‌ పెట్టిన పోస్ట్‌లో ఏముందంటే….`తెలుగుదేశం కార్యకర్తల కష్టంతో నాయకులుగా ఎదిగినవారిని తెరాస తన పార్టీలో చేర్చుకుంటోంది. కార్యకర్తల త్యాగ ఫలాలను దోచుకుపోతున్న తెరాసకు తెలియని విషయం ఏంటంటే… వేళ్ళు భూమిలో బలంగా నాటుకుపోయిన ఒక మహా వృక్షం తెదేపా. మీరు దొంగిలిస్తోంది పండ్లను మాత్రమే. చెట్టు మాత్రం ఏ కాలానికీ చెక్కుచెదరదు. ఈ విషయాన్ని మా కార్యకర్తలే రుజువు చేసి చూపిస్తారు.`లోతైన అంచనాతో, ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో లోకేష్‌ పెట్టిన పోస్ట్‌ తమకు ఉత్సాహాన్ని అందించేదని టీడీపీ నాయకులు చెప్తున్నారు. టీఆర్ఎస్‌కు లోకేష్ పంచ్ అదిరింద‌ని విశ్లేష‌కులు విశ్లేషిస్తున్నారు.

No comments:

Post a Comment