Wednesday 10 February 2016

కాపుల ఉద్య‌మంపై ‘సినిమా’

04808045120

స‌మాజంలో ఏదైనా హాట్ టాపిక్ న‌డుస్తుంటే వాటిపై సినిమాలు తీసి సొమ్ము చేసుకోవ‌డానికి, క్రేజ్ సంపాదించ‌డానికి రెడీ అవుతుంటారు. ఈ త‌ర‌హా సినిమాలు తీయాలంటే మ‌న‌కు వెంట‌నే గుర్తొచ్చే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ. ప్రస్తుతం కాపుల రిజర్వేషన్ అంశంపై నిప్పు రాజుకుంటున్న నేపథ్యంలో వ‌ర్మ కాపు నేత వంగవీటి రాధా జీవిత కథతో ‘వంగవీటి’ సినిమాను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఆ త‌ర‌హాలోనే ప్ర‌స్తుత క‌రెంట్ టాపిక్ కాపు ఉద్యమంపై ఏపీ నాయుడు అనే వ్యక్తి ‘ప్రజా గర్జన’ పేరుతో ఓ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ముద్రగడ అండ్ కో చేస్తున్న ఉద్యమం నేపథ్యంలోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు నాయుడు.
ఏపీ జనాభాలో 30 శాతం ఉన్న కాపులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తామని అంటున్నాడు నాయుడు. ప్రాథమిక హక్కుల కోసం పోరాడటం కూడా ఒక హక్కే అనే నినాదం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని ఆయన ప్రకటించాడు. ఇప్పటికే ముద్రగడ ఆందోళన నేపథ్యంలో ‘జయహో ముద్రగడ’ పేరుతో ఓ పాట కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడిక కాపు ఉద్యమంపై సినిమానే తెరకెక్కబోతుండటం విశేషమే. ఈ చిత్రంలో కొందరు కాపు నేతలు కూడా కనిపిస్తారట.

No comments:

Post a Comment