Friday 5 February 2016

మహేష్ నిర్మాతలకు సినిమా చేస్తున్న ప్రభాస్



మహేష్ బాబు తో శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ని నిర్మించిన సంస్థ మైత్రి మూవీస్ ,ఆ సంస్థ తో కలిసి పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్ . ప్రస్తుతం బాహుబలి పార్ట్ 2 షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ ఆ చిత్రం తర్వాత రెండు చిత్రాలు చేయడానికి రెడీ అయ్యాడు అంటే దాదాపు మరో రెండేళ్ళ సమయం అన్నమాట ! ఆ తర్వాత మైత్రి మూవీస్ లో ఒక సినిమా చేయనున్నాడు ప్రభాస్ . బాహుబలి తో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిన విషయం తెలిసిందే ! దాంతో ప్రభాస్ తో సినిమా చేయడానికి అటు బాలీవుడ్ వాళ్ళు ఇటు తెలుగువాళ్ళు బోలెడు మంది క్యూ లో ఉన్నారు . 

No comments:

Post a Comment