Wednesday 10 February 2016

మహేష్ పై మణిరత్నం షాకింగ్ కామెంట్

48045012200

ప్రిన్స్ మహేష్ బాబు గతంలో స్టార్ డైరెక్ట మణిరత్నం మూవీలో నటిస్తాను అని మూడు సార్లు మాట ఇచ్చాడంట. అయితే మణిరత్నం తో తను ఎప్పుడైతే కమిట్ అవుదామని చూస్తాడో…ఆ సమయంలోనే మహేష్ కి వరుస బ్లాక్ బస్టర్స్ పడటం..మణిరత్నం కంటే కమర్షియల్ పరంగా భారీ విజయాన్ని అందించే డైరెక్టర్స్ ప్రిన్స్ తో కమిట్ అవ్వటం జరుగుతుంది. ఆ విధంగా ప్రిన్స్ మహేష్, ఇప్పటి వరకూ మణిరత్నం కి మూడు సార్లు షాక్ ఇచ్చాడు. పోకిరి మూవీ కి ముందుకు ఒకసారి, దూకుడు మూవీ సమయంలో ఒకసారి, తాజాగా శ్రీమంతుడు మూవీ సమయంలో ఒకసారి. ఇప్పుడు శ్రీమంతుడు తరువాత మణిరత్నం, మహేష్ బాబు కాంబినేషన్ తెరకెక్కాల్సిన సరిస్థితి ఉంది. కానీ చివరి నిముషంలో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. దీంతో ‘ఓకే బంగారం’ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చిన మణిరత్నం గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నాడు. ఇక మహేష్ బాబుతో పని కాదనుకున్న మణిరత్నం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ కధని రెడీ చేసుకున్నాడు. ఆ కథని కార్తీకి చెప్పడం, కార్తీకి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ప్రస్తుతం కార్తీ చేస్తున్న సినిమా పూర్తయిన తరవాత జూన్ నుంచి ఈ సినిమా మొదలవుతుందని అంటున్నారు. అయితే మణిరత్నం మాత్రం ప్రిన్స్ మహేష్ ఇచ్చిన షాక్ ని కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతిఒక్కరికి చెబుతున్నాడంట. కమిట్మెంట్ ఎందుకు తప్పుతారో అని ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది.

No comments:

Post a Comment