Saturday 30 January 2016

అమ్మ ప్రేమ సేల్ ఇన్‌ ఆంధ్రా

10452012030

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌య‌ల‌లిత పేద ప్ర‌జ‌ల‌కు పంచిపెట్టిన “అమ్మ” మిక్సీలు, గ్రైండర్లు ప్ర‌స్తుతం ఆంధ్రాలో అమ్ముతున్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల టైంలో జ‌య‌ల‌లిత ఇచ్చిన మిక్సీలు, గ్రైండ‌ర్లు ఇప్పుడు స‌రిహ‌ద్దులు దాటి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో రోడ్డు ప‌క్క‌న వాటిని విక్ర‌యిస్తున్నారు. అమ్మ మిక్సీ రూ. 500ల‌కు, గ్రైండ‌ర్ రూ. 1600కు అమ్ముతున్నారు. త‌క్కువ ధ‌ర‌ల‌కే ఈ వ‌స్తువులు విక్ర‌యిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు ఎగ‌బ‌డి మ‌రీ కొనుగోలు చేస్తున్నారు. వాటి ధ‌ర‌లు డిమాండ్, స‌ప్ల‌యి ఆధారంగా మారుతూ ఉంటాయి. రూ. 3 వేల నుంచి రూ. 10 వేల వ‌ర‌కు గ్రైండ‌ర్ల‌ను అక్క‌డ విక్రయిస్తున్నారు. ఒక్కోసారి ఇవే గ్రైండ‌ర్ల‌ను రూ. 1600 కూడా అమ్ముతున్నారు.
అమ్మ ఎంతో ప్రేమ‌గా ఇచ్చిన మిక్సీలు, గ్రైండ‌ర్ల‌ను చాలా మంది త‌మిళ ప్ర‌జ‌లు అమ్మేస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల‌కు చెందిన వారు అక్క‌డికి వెళ్లి ఆయా వ్య‌క్తుల నుంచి వాటిని తక్కువ ధ‌ర‌కు కొనుగోలు చేస్తున్నారు. ఆ త‌ర్వాత‌ వాటిని నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల‌ మార్కెట్ల‌లో లాభానికి అమ్ముకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా అమ్మ మిక్సీలు, గ్రైండ‌ర్లు అమ్ముతున్న వ్యాపారులు మాట్లాడుతూ త‌మిళ‌నాడు నుంచి వాటిని తెచ్చుకోవ‌డానికి రెండు లేదా మూడు రోజులు పడుతుంద‌ని చెప్పారు. ఒక్కొక్క మిక్సీపై సుమారు రూ. 300 లాభం వేసుకుని అమ్ముతామ‌ని వ్యాపారులు చెబుతున్నారు.

No comments:

Post a Comment