గెస్ట్ హౌస్ లో సాయిధరమ్ తేజ్, రెజీనా?
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారన్న వార్తలు కొద్ది రోజులుగా టాలీవుడ్లో జోరుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ షూటింగ్ టైంలో ప్రేమలో పడిపోయారని, రెండో సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ షూటింగ్ సమయంలో ఇద్దరూ బాగా దగ్గరయ్యారని టీ టౌన్ టాక్. ఇదిలా ఉంటే ఇప్పుడు వీరిద్దరు ఓ ప్రముఖ టాలీవుడ్ నటి కట్టించిన గెస్ట్హౌస్లో ఎక్కువ సమయం గడుపుతున్నారట…ఈ గెస్ట్హౌస్లోనే ఎక్కువగా కనపడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఆ నటి కట్టించిన ఓ లాంజ్ చాలా పీస్ఫుల్గా ఉండడంతో టాలీవుడ్లో చాలా మంది యంగ్ హీరోలు, హీరోయిన్లు అక్కడే కలుసుకుని సమయం గడపడానికి ఓ లవ్ అడ్డాగా చాలా బాగుందట. వీరిద్దరూ ఎక్కువ సమయం అక్కడే ఎంజాయ్ చేస్తున్నారని సమాచారం. ఇటీవలే వీరిద్దరు సీక్రెట్గా ఓ ట్రిప్ కి కూడా వెళ్లి వచ్చారని తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్, రెజీనా ఇద్దరూ తమ ప్రేమను నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరో విషయం ఏంటంటే సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం తిక్క సినిమా షూటింగ్లో రెజీనా హీరోయిన్ కాకపోయినా ఆమె మాత్రం ప్రతి రోజు ఆ షూటింగ్ స్పాట్కు వెళ్లి గ్యాప్ వస్తే చాలు సాయితో మీటింగ్ పెట్టేస్తుందట. తిక్క సినిమా యూనిట్ సభ్యులైతే సాయి-రెజీనా లవ్ పీక్స్టేజ్కు వెళ్లిందన్న వార్తలు లీక్ చేసేశారు. సో… ఈ మెగా కాంపౌండ్ హీరో తన ప్రేమ విషయంలో సీరియస్ గానే ఉన్నాడని చెప్పొచ్చు. చివరికి వీరి ప్రేమ వ్యవహారాని ఎలాంటి ఫినిషింగ్ టచ్ వస్తుందో చూడాలి.
please share it..
No comments:
Post a Comment