తెలుగులో టాప్ మోస్ట్ న్యూస్ ఛానెల్ అయిన టీవీ 9 కూడా సినిమా
నిర్మాణంలోకి దిగడం అనే కొత్త కాన్సెప్ట్ మొదలు పెట్టింది. మధుర శ్రీధర్తో కలిసి ఒక్క మనసు అనే సినిమాను నిర్మిస్తోంది. మల్లెల తీరం దర్శకుడు రామరాజు ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాకు ముందుగా క్రేజీ కాంబినేషన్ సెట్ చేయడంతో సగం విజయం సాధించారు. మెగాస్టార్ బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారికను హీరోయిన్ గా తీసుకోవడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది. మా టీవీ సహాయ సహకారాలు అదించిన రాజు గారి గది సినిమా సక్సెస్ కావడంతో అదే బాటలో ఇప్పుడు టీవీ 9 కూడా వెళుతోంది.
అయితే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇప్పటికే చాలా ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఓవర్ సీస్ 30లక్షలు, కృష్ణ 50, నెల్లూరు 20 కి అమ్మేశారు. విశాఖ ఎనభై వరకు చెబుతున్నారు. నైజాం, సీడెడ్,ఈస్ట్ వెస్ట్ రైట్స్ ఇంకా సేల్ అవ్వాల్సి ఉంది. సినిమాకి అయిన ఖర్చు పబ్లిసిటీ అంతా కలుపుకున్నా నాలుగు నుంచి నాలుగున్నర కోట్ల మధ్యే. అంటే శాటిలైట్ అక్కర లేకుండానే పెట్టుబడి వచ్చేలా వుంది. అదృష్టం బాగుండి శాటిలైట్ కు ఓ మూడు వచ్చినా, మధుర శ్రీధర్ కు టీవీ 9 కు చెరో కోటిన్నర లాభం. పైగా టీవీ 9 పబ్లిసిటీకి ఖర్చు కూడా లెక్కల్లో వేయాల్సిందే.
అంటే ఈ సినిమా ఇప్పటికే పెట్టుబడి వెనక్కు రాగా, కోటిన్నర లాభం..పైగా ఛానెల్ కు ఓ పాతిక, ముఫై లక్షల పబ్లిసిటీ ఆదాయం. ఈ కాన్సెప్ట్ క్లిక్ అయితే ఇక మిగిలిన ఛానెళ్లు కూడా ఈ బాట పట్టే అవకాశం వుంది. కానీ మరీ వేలం వెర్రిగా ముందు వెళ్తే, చేతులు కాలిపోయే ప్రమాదం కూడా వుంది. ఒక్క మనసు సినిమా కేవలం ఆరు రోజుల షూట్ మినహా అంతా పూర్తయిపోయింది. ఫిబ్రవరి రెండోవారానికి దాదాపు సినిమా రెడీ అయిపోతుంది. ఏదేమైనా ఒక్క మనస్సు సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి భేరం రావడంతో టీవీ 9 ఛానెల్కు మంచి లాభం దక్కింది.
No comments:
Post a Comment