ప్రభాస్ ఫై సంచలన వాఖ్యలు చేసిన దిల్ రాజు
శర్వానంద్ హీరోగా
మేర్ల పాక గాంధి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎక్స్ ప్రెస్ రాజా ' చిత్రాన్ని యు . వి క్రియేషన్స్ బ్యానర్ ఫై వంశీ,ప్రమోద్ లు నిర్మించిన ఈ చిత్రం ఆడియో విడుదల నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ చిత్రం ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ లుగా హీరో ప్రభాస్ , దిల్ రాజు లు వచ్చారు. యు వి క్రియేషన్స్ సంస్థ అధినేతలు పేరుకు వంశీ ,ప్రమోద్ లు ఉన్న ,వెనుకనుండి నడిపించేది ప్రభాస్ అని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.ఈ నేపధ్యంలో 'ఎక్స్ ప్రెస్ రాజా' ఆడియో వేడుకకు గెస్ట్ గా వచ్చిన దిల్ రాజు , ప్రభాస్ ఫై సంచలన వాఖ్యలు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారాయి. ' మీకందరికీ తెలుసో తెలియదో కాని యు వి క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ బినామి బ్యానర్ , హీరో ప్రభాస్ దే ఈ సంస్థ అని వాఖ్యానించారు. దిల్ రాజు ఇలా ఎందుకు మాట్లాడాడో తెలియదు కాని మొత్తానికి జనాల్లో ఉన్న కన్ప్యుజన్ కు ఓ క్లారిటీ ఇచ్చాడు.
No comments:
Post a Comment