Tuesday 2 February 2016

హై డ్రామలో పవన్ ఇరుకున్నాడా?

08015020210



పవర స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా పెట్టిన ప్రెస్ మీట్ చర్ఛనీయాంశంగా మారింది. తునిలో జరగిన ఘటన పవన్ ని బాధించటం కారణంగా ఆ ప్రెస్ మీట్ ని పెట్టాడు. ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో కాపు ఐక్యవేదిక నిర్వహించిన మహా గర్జనలో హింసాత్మక ధోరణి కనిపించింది. కాపులను బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపు ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు ఇచ్చింది. దీంతో పెద్ద ఎత్తున ఒకే సామాజిక వర్గం సభ్యులు లక్షల్లో సభకి హాజరు అయ్యారు. ఇక ఈ గర్జనలో చివరకు రత్నాచల్ ఎక్స్‌ ప్రెస్‌ను తగలబెట్టటమే కాకుండా పలు వాహనాలను…ఓ పోలీస్ స్టేషన్ ని తగలబెట్టారు. ఇదే విషయం గురించి మాట్లాడిన పవన్ కి, జరిగిన ఘటన పై…అలాగే సామాజిక వర్గం చేస్తున్న పోరాటం పై ఎక్కడా అవగాహన లేదని తెలుస్తుంది. పేరుకి పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం పెట్టాడనే కానీ, కచ్ఛితమైన వివరాలు లేకపోవటంతో అతను ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడో అనేది ఎవ్వరికి ఇక్కడ అర్ధం విషయంలా మారింది. కాపు వర్గాన్ని బలపరచాలని ప్రెస్ మీట్ పెట్టారా? లేక అల్లరి మూకలు చేసింది ఎవరో తనకు తెలుసు అని చెప్పేందుకు పెట్టారా? అనేది ప్రెస్ మీట్ తరవాత ఎవ్వరికి అర్ధం కాలేదు. అయితే బాబుగారు పవన్ కళ్యాణ్ కి స్వయంగా ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టాలిని, జగన్ ని టార్గెట్ చేయాల్సిందిగా కోరారు అనే వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ హుటాహుటిన సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ వదులుకొని హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఏదేమైనా ఆవేశంలో వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో కూర్చున్నాడనే కానీ, సబ్జెక్ట్ పూర్తి వివరాలు తెలియకపోవటంతో…రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకి కొంత ఇరుకున పడాల్సి వచ్చిందని అంటున్నారు. ఇకనైన ఏదైనా సంఘటనపై ప్రెస్ మీట్ పెట్టే ముందు…అన్నీ వివరాలను తెలుసుకొని వస్తే మంచిదని అంటున్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో బాబు వర్గం, పవన్ ని అడ్డంగా బుక్ చేయించిందని అంటున్నారు. అయితే పవన్ మాత్రం చాలా తెలివిగా “నేను ప్రజల తరపున మాట్లాడుతున్నా. ఏ ఒక్క కులం తరపునో మాట్లాడడం నాకు తెలీదు” అని స్పష్టం చేసి, ప్రెస్ మీట్ కి ఓ అర్ధాన్ని ఇచ్చారు.

No comments:

Post a Comment