Tuesday 2 February 2016

ఆ డైరెక్టర్ సలహాపై పవన్ సీరియస్

04781045020



పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సీరియస్ అయ్యాడు. వచ్చిన పని చూసుకున్నామా? లేదా? అన్నట్టగా కాకుండా…పవన్ విషయంలో కొద్దిగా అత్యుత్సాహం చూపించినందుకు మొట్టికాయలు వేయుంచుకున్నాడంట. తమిళంలో అజిత్ హీరోగా నటించిన ‘వేదాళం’ సినిమా దీపావళి కానుకగా విడుదలై కోలీవుడ్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ కోలీవుడ్ బాక్సాపీస్ మార్కెట్ ని ఓ ఊపు ఊపింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. అయితే ఈ సినిమాను తెలుగులో డబ్ చేయాలని చూశారు. కానీ కొంత మంది నిర్మాతలు ఈ మూవీని తెలుగులో రిమేక్ చేయాలని చూస్తున్నారు. అయితే ఇది ఇప్పటి వరకూ సాధ్యపడలేదు. అయితే తాజాగా డైరెక్టర్ సూర్య, ఈ సినిమాను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌, దర్శకుడు ఎస్.జె.సూర్య, నిర్మాత ఏ.ఎమ్.రత్నమ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. అలాగే మరోవైపు ఇదే సూర్య, బ్లాక్‌బస్టర్ ‘ఖుషీ’కి సీక్వెల్ గా పవన్ తో మూవీకి ప్లాన్ చేస్తున్నాడు.ఇక ఈ విషయంలో పవన్ నుండి డైరెక్టర్ సూర్యకి ఓ క్లారిటి వచ్చింది. ఖుషి సీక్వెల్ అయితే ఓకే కానీ, వేదాలం మూవీ రిమేక్ అంటేనే కామెడీగా ఉందని అన్నాడంట. వేదాలం మూవీలో అజిత్ చేసే యాక్షన్, తనకి ఏ మత్రం సూట్ కాదని పవన్ చెప్పుకొచ్చాడంట. ఇటువంటి చెత్త ప్రపోజల్స్ మరోసారి తీసుకురావద్దని గట్టిగా చెప్పాడంట. అయితే పవన్ మాత్రం ఖుషీ రిమేక్ పై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పూర్తైన వెంటనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళుతుందని తెలుస్తుంది.

No comments:

Post a Comment