ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రిపబ్లిక్ డే సందర్భంగా ఓ బహుమతి ప్రకటించారు. తక్కువ ధరకే పేదలకు క్యాన్సర్ వైద్యం అందించే లక్ష్యంలో ఏపీలోనూ బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. బసవతారకం ఆస్పత్రి చైర్మన్గా మంగళవారం ఆయన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్లో గల బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ధరకే పేదలకు వైద్యం అందించేందుకు ఏపీలో ఎన్టీఆర్ క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేశారని చెప్పారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు. అంతర్జాతీయ స్థాయి పరిశోధన కేంద్రంగా ఆస్పత్రిని తీర్చిదిద్దుతామన్నారు. రాష్ర్ట విభజన కారణంగా ఈ ఆసుపత్రి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కూడా మరో ఆసుపత్రిని అక్కడి నిర్మిస్తామని బాలయ్య ప్రకటించారు. క్యాన్సర్ రోగులకు తక్కువ ధరకే మెరుగైన వైద్యం అందించడంలో పేరున్న బసవతారకం ఆసుపత్రి ఏపీలో ఏర్పాటుకానుండడం ఎంతైనా శుభ పరిణామమే. అలాగే దేశంలో అత్యాచారాలు పెరగటం అందోళన కరమని కూడా బాలయ్య అన్నారు.
No comments:
Post a Comment