Sunday 3 January 2016

భాగ్య‌న‌గ‌రిలో బూతు పురాణం

004840842012012

భాగ్య‌న‌గ‌రి సెక్స్‌ టూరిజానికి అడ్డాగా మారుతోంది.మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికాకు చెందిన మధ్యవయస్కులైన ముస్లింలు ‘వన్‌ మంత్‌ వైవ్స్‌’ కోసం దక్షిణ భారతదేశాన్ని ఎంచుకున్నారు.ముఖ్యంగా హైద్రాబాద్‌ పాతబస్తీలోని పేద ముస్లింలు ఈ విధానానికి ఆకర్షితులవుతున్నారు.ధనవంతులైన యూరప్‌, మధ్య ఆసియా ప్రాంతాల ముస్లింలు ఇక్కడి వారి పేదరికాన్ని ఆసరాగా తీసుకుని వారిని లోబరుచుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఉదంతాన్ని ఓ యువతి బట్టబయలు చేసింది.
మోసం జ‌రిగేదిలా..?
పాత బస్తీకి చెందిన ఓ యువతి (16)ని ఆమె ఆంటీ ముంతాజ్‌ బేగం ఓ ఖరీదైన హోటల్‌కు తీసుకెళ్లింది.అక్కడ దుబాయ్‌లోని ఓ ఆయిల్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ (52)కు పరిచయం చేసింది.అతని వద్ద నుంచి దాదాపు లక్ష రూపాయలు తీసుకుని వారిద్దరికీ వివాహం చేసింది. వివాహ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌తోపాటు ‘తలక్‌నామా’ కూడా తెచ్చింది.(తలక్‌నామా అంటే ఆ వ్యక్తి సెలవు పూర్తయిపోయే చివరి రోజున వారిద్దరికీ విడాకులు లభించి నట్టు వెల్లడి చేసే పత్రం) వివాహం త‌రువాత రోజు ఆ.. వ్యక్తి ఆ యువతి ఇంటికి వచ్చి సెక్స్‌ కోసం బలవంతం చేశాడు. నేను నీ భర్త అనీ, తాను చెప్పినట్టు నడుచుకోవాలని ఆమెను బెదిరించాడు.తన తండ్రి వయసు కంటే ఎక్కువ వయసు గల వ్యక్తితో సెక్స్ చేసేందుకు నిరాకరించిందామె! అక్కడ నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ రాకెట్‌ గుట్టు విప్పారు.ఇవాళ ముంతాజ్ ఒక్క‌రే కాదు సెక్స్ రాకెట్‌కు బ‌లైపోతున్న యువ‌తులెంద‌రో..!
please share it..

No comments:

Post a Comment