ప్రముఖ పోర్న్స్టార్ సన్నీలియోన్కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ చూస్తున్న
ఎంతో మంది స్టార్లు సైతం కుళ్లు కుంటున్నారు. యువత దృష్టిలో ఆమె ఓ శృంగార దేవతగా పాపులర్ అయ్యింది. సన్నీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ఆమె తాజా చిత్రం మస్తీజాదే గురించి చెపుతూ ‘మస్తీజాదే’ కథ వింటున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఇదొక లవ్ కామెడీ లైన్ ఉన్న కథ. నేను ఇదివరకు ఎప్పుడూ వినని కథ కాబట్టి ఒప్పుకున్నాను. అందులోను ఇందులో నాది ద్విపాత్రాభినయం. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది. అందుకే ఓకే చేశాను. ప్రేక్షకులకు ఎంత వరకు నచ్చుతుందో చూడాలి మరి. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నంత సేపు అందరం నవ్వుకుంటూనే పనిచేసుకుపోయాం. అంత కామెడీ ఉంది ఇందులో అని చెప్పింది.
అలాగే అన్నింటికన్నా ముఖ్యంగా తాను తెలుగులో చేయడం మరపురానిదని…. హైదరాబాద్లో ఉన్నప్పుడు దగ్గరల్లోని రెస్టారెంట్కు వెళ్లి బిర్యానీ తినాలనుకున్నా తినలేకపోయాని చెప్పింది. తెలుగు నటుడు మోహన్బాబు అంటే తనకు చాలా ఇష్టమని…ఆయనతో నటించాలన్నదే తన కోరిక అని సన్నీ చెప్పింది.
మోహన్బాబు కుమారుడు మనోజ్ నటించిన కరెంటుతీగ సినిమాలో సన్నీ ఓ గెస్ట్ రోల్లో కాసేపు కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆడియో ఫంక్షన్లో మోహన్బాబు కూడా తనకు సన్నీ అంటే ఇష్టమని చెప్పారు. ఇప్పుడు సన్నీ కూడా తనకు మోహన్బాబు అంటే ఇష్టమని…ఆయనతో నటించాలని ఉందని చెప్పి మోహన్బాబుకు ఆఫర్ ఇచ్చింది. మరి మోహన్బాబు సన్నీ కోరికను తీరుస్తాడో లేదో చూడాలి.
No comments:
Post a Comment