గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ బరువు బాధ్యతలను నారా లోకేష్ తన భుజాలపై వేసుకున్నారు. గ్రేటర్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలపై గట్టిగానే కౌంటర్లు విసురుతున్నారు లోకేష్. గ్రేటర్ పరిధిలోని సమస్యలను ప్రస్తావిస్తూ టీడీపీని గెలిపిస్తే ఏ విధంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తుందో వివరిస్తున్నారు. మధ్యమధ్యలో పంచ్ డైలాగులు విసురుతున్నారు. అయితే లోకేష్ ఈ రేంజ్లో మాట్లాడడం అంతా ట్యూషన్ మహిమగా చెబుతున్నారు పార్టీ నేతలు.
టీటీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి రోజూ లోకేష్కు తర్పీదు ఇస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎలా మాట్లాడాలి….ఏఏ సమస్యలను ప్రస్తావించాలి, టీఆర్ఎస్ బలహీనతలు ఏమిటీ వంటి అంశాలపై లోకేష్కు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ సిటీ రాజకీయాలను ఎలా అర్థం చేసుకోవాలో కూడా లోకేష్కు శిక్షణ ఇస్తున్నారట. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగిసే వరకు లోకేష్కు కంటెన్ట్ను రావుల అందజేస్తారని.. ఇందుకోసం ఆయన బాగానే కసరత్తు చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. లోకేష్ తొలి ప్రసంగాల్లో మరీ బరువైన పదాలు వాడుతుండడం గమనించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి … సాధారణ భాష వాడాల్సిందిగా సూచించారట. అందుకే రానురాను లోకేష్ ప్రసంగాల్లో మార్పు కనిపిస్తోందని చెబుతున్నారు.
No comments:
Post a Comment